తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి జిల్లా:
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు సోమవారం స్వామివారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు...
SB NEWS
May 22 2023, 09:45